25°C Hanamkonda
May 9, 2024
కంగనా రనౌత్ జీవిత చరిత్ర..
Politics Uncategorized

కంగనా రనౌత్ జీవిత చరిత్ర..

Mar 27, 2024

బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు గాంచిన కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. బీజేపీ తరఫున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కంగనా రనౌత్‌కు అవకాశం కల్పించారు.

గత కొన్నేళ్లుగా బీజేపీకి.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేస్తున్న కంగనా.. తాజాగా బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. అయితే బాలీవుడ్‌లోనూ తన నటన, పాత్రలతో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న కంగనా.. ఏకంగా 15 నేషనల్ అవార్డ్స్‌‍ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలోనే అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చారు. ఎలా ఎదిగారు. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో చూద్దాం.

చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలోనే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో వాటికి తెరపడి ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు.

ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై కంగనా స్పందించారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే అంత కన్నా సంతోషం ఇంకేమీ ఉండదని వెల్లడించారు. తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని.. ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గంలోని భాంబ్లా ప్రాంతంలో జన్మించారు. అయితే 15 ఏళ్ల వయసులో ఉన్నపుడే.. ఇంటిని, కుటుంబాన్ని వదిలేసి పారిపోయారు. అప్పుడు ముంబై చేరుకున్న కంగనా.. మోడలింగ్, సినిమాల కోసం తీవ్రంగా కష్టపడ్డారు.ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. చివరికి సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే కంగనా డ్రగ్స్ బారిన పడ్డారు. సినిమా కెరీర్ సరిగా లేకపోవడంతో.. ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులను వీధుల్లో గడపాల్సి వచ్చింది. ఇక నటుడు ఆదిత్య పంచోలి విషయంలో ఆమె గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

ఆదిత్య పంచోలి తనను కొట్టేవాడని కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రులు వీధుల్లో గడిపానని.. శారీరక హింసలు కూడా ఎదుర్కొన్నానని కంగనా తెలిపారు.  ఎ లవ్ స్టోరీ సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2008 లో ఫ్యాషన్.. 2010 లో వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ ముంబై.. 2011 లో తను వెడ్స్ మను సహా పలు కీలక సినిమాల్లో కంగనా రనౌత్ నటించారు.

ఇక 2014 లో వచ్చిన క్వీన్ సినిమాతో విమర్శల నుంచి కూడా కంగనా ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ సినిమాకు ఆమె డైలాగ్‌లు కూడా రాశారు. ఈ సినిమాతో బాలీవుడ్ క్వీన్ అనే పేరు కూడా కంగనకు వచ్చింది. ప్రధానంగా హిందీ సినిమాల్లోనే నటించిన కంగనా.. ఆ తర్వాత తమిళ చిత్రాలు కూడా చేశారు.

తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా 2021 లో తీసిన తలైవి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2023 లో చంద్రముఖి 2 సినిమాలో కూడా కంగనా నటించారు. ఈ క్రమంలోనే కంగనకు 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 3 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు లభించాయి. ఇవే కాకుండా స్క్రీన్, జీ సినీ, సైమా, ప్రొడ్యూసర్ గిల్డ్‌ల నుంచి ఒక్కో అవార్డు కంగనను వరించాయి.

2021 లో నాలుగో నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను అందుకున్న తర్వాత తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. పంగా, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రాలకు గాను కంగనా రనౌత్‌ను ఉత్తమ నటి అవార్డు వరించింది. ఇక 2020 ఏడాదికి గాను కంగనా రనౌత్‌ పద్మ శ్రీ అవార్డును దక్కించుకున్నారు. 2021 లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మా అవార్డుల ప్రదానోత్సవంలో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా పద్మ శ్రీ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *